లైనింగ్ లేకుంటే నీళ్లు ఇవ్వరా.. | Does not give water without lining? | Sakshi
Sakshi News home page

లైనింగ్ లేకుంటే నీళ్లు ఇవ్వరా..

May 16 2016 2:49 AM | Updated on Oct 16 2018 6:27 PM

లైనింగ్ లేకుంటే నీళ్లు ఇవ్వరా.. - Sakshi

లైనింగ్ లేకుంటే నీళ్లు ఇవ్వరా..

‘కాలువలకు లైనింగ్ లేకుంటే భూములకు నీరివ్వరా.. సాకులు చెప్పి కాంట్రాక్టర్లను బతికిచ్చే పనులు చేయొద్దు. కాంట్రాక్టరు పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిసింది.

♦ సాకులుచెప్పి కాంట్రాక్టర్లను బతికించొద్దు
♦ పనులు పూర్తికాకుంటే బ్లాక్‌లిస్టులో పెట్టిస్తాం
♦ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు
♦ మంత్రి కాన్వాయిని అడ్డగించిన భైంసావాసులు
 
 భైంసా: ‘కాలువలకు లైనింగ్ లేకుంటే భూములకు నీరివ్వరా.. సాకులు చెప్పి కాంట్రాక్టర్లను బతికిచ్చే పనులు చేయొద్దు. కాంట్రాక్టరు పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిసింది. ఈయేడు పనులు పూర్తి కాకుంటే కాంట్రాక్టరును బ్లాక్ లిస్టులోపెట్టిస్తాం. రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులకు లైనింగ్ ఉంది. ఎందుకు తమాషా చేస్తున్నారు.. అంతా క్లియర్ చేయండి.. కలెక్టర్‌గారు మోటార్ సైకిల్ వేసుకుని నడుపుండ్రి. మల్లా అచ్చి నేను మోటార్ సైకిల్ వేసుకుని కాలువల వెంబడి నడుపుతా. ఈఈ, సీఈలతో ఓసారి కెనాల్‌పైకి వెళ్లండి. పనుల పరిస్థితి తెలుసుకోండి..’ అంటూ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను తీవ్రంగా హెచ్చరించారు.  ఆయన ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. భైంసా సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు ప్రారంభమై పదేళ్లరుునా ఇప్పటికీ పూర్తిస్థాయిలో 14 వేల ఎకరాలకు సాగునీరు అందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.  

 కాన్వాయి అడ్డగింత..
 మంత్రి కాన్వాయిని కుభీర్ రోడ్డులో భైంసావాసులు అడ్డగించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులు రోడ్డుకు పక్కనే ఉన్న ఇళ్లను తొల గించారని వారంతా రోడ్డుపైకి చేరుకున్నారు. విష యం తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిలు వారితో మాట్లాడారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆందోళనకారులకు హామీనిచ్చారు. దీంతోవారంతా శాంతించా రు. రెండు నెలల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని తెలిపారు.  బాసర సరస్వతీ అమ్మవారిని మంత్రులు  హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ నగేష్, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement