‘ప్రశాంతంగా గణేష్‌ నిమజ్జనం’ | DGP Mahender Reddy Comments On Vinayaka Nimajjan Hyderabad | Sakshi
Sakshi News home page

‘ప్రశాంతంగా గణేష్‌ నిమజ్జనం’

Sep 12 2019 4:49 PM | Updated on Sep 12 2019 4:56 PM

DGP Mahender Reddy Comments On Vinayaka Nimajjan Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం కొనసాగుతోందని, ముందస్తుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మూడు కమిషనరేట్‌ల పరిధిలో మొత్తం 5 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. 35వేల మంది పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సహకారంతో ఈ ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్‌లో ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుగుతోందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement