అలసత్వాన్ని, అవినీతిని కానీ ఉపేక్షించేది లేదు.. | deputy cm said to complete mission bhagiratha works in time | Sakshi
Sakshi News home page

అలసత్వాన్ని, అవినీతిని కానీ ఉపేక్షించేది లేదు..

Apr 4 2017 5:54 PM | Updated on Sep 5 2017 7:56 AM

అలసత్వాన్ని, అవినీతిని కానీ ఉపేక్షించేది లేదు..

అలసత్వాన్ని, అవినీతిని కానీ ఉపేక్షించేది లేదు..

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఐదు సెగ్మెంట్స్ ద్వారా మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.

వరంగల్‌: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఐదు సెగ్మెంట్స్ ద్వారా మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. దీనికి సంబంధించిన పనులు  సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వాన్ని గాని, అవినీతిని కానీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల అధికారులతో అబివృద్ది కార్యక్రమాల ప్రగతిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం ఇక్కడ సమీక్షించారు.

ఈ సందర్బంగా మిషన్ భగీరథ పనులు ఎక్కడివరకు వచ్చాయి, ప్రజలకు ఎప్పటిలోపల  మంచినీటిని అందజేయగలం అనే విషయంపై చర్చించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, నగర మేయర్ నరేందర్‌, శాసన సభ్యులు దయాకర్ రావు, ప్రభుత్వ విప్ వెంకటేశ్వర్లు, ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, రెడ్యా నాయక్, రాజయ్య, వినయ్ భాస్కర్, ఎంపీలు సీతారాం నాయక్, దయాకర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పద్మ, ‘కుడా’ చైర్మన్ యాదవరెడ్డి, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement