
సైకిల్ రిక్షాలో ప్రసవం
పురిటి నొప్పులతో బాధపడుతోన్న నిండు గర్భిణిని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా, ఆమె సైకిల్ రిక్షాలోనే ప్రసవించింది.
స్థానిక దళితవాడకు చెందిన నిండు గర్భిణికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమెను రిక్షాలో సమీపంలోని పీహెచ్సీకి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే ప్రసవించింది. ఆశా వర్కర్, కాలనీ మహిళలు ఆ బాలింతను, శిశువును అదే రిక్షాలో ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇరువురూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.