డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం

Degree Student Woman Suicide In Mahabubnagar District - Sakshi

కొత్తకోట : పెళ్లి నిశ్చయమైన ఓ విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కొత్తకోటలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొత్తకోటకు చెందిన చంద్రయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె కృష్ణవేణి(20) స్థానికంగా ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. కాగా వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు (కృష్ణవేణి మేనమామ)తో ఈ నెల 10 వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు.

ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో కాని కృష్ణవేణి ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం గమనించిన కుటుంబీకులు కృష్ణవేణిని కిందకి దించి పరిశీలించగా అప్పటికే మృతిచెందింది. దీంతో  కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ రవికాంత్‌రావు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top