నిలిచిపోయిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు | Sakshi
Sakshi News home page

నిలిచిపోయిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

Published Wed, May 3 2017 11:25 AM

నిలిచిపోయిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు నిలిచిపోయాయి. ప్రైవేటు డిగ్రీ కాలేజీలు తమ సెంటర్లలో పరీక్షలను బాయ్‌కాట్‌ చేయడంతో పరీక్షలు నిలిచిపోయాయి.

సీబీసీఎస్‌ సెమిస్టర్స్‌ విధానంతో డిగ్రీ, పీజీ యాజమాన్యాలపై 30 శాతం అదనపు భారం పడుతుందని తెలంగాణ ప్రైవేట్‌ డిగ్రీ అండ్‌ పీజీ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. డిగ్రీ, పీజీ ఫీజులు పెరగకపోవడంతో సకాలంలో తమకు రీయింబర్స్‌మెంట్‌ అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు పెరిగే వరకు ఆన్‌లైన్‌ అడ్మిషన్‌లలో పాల్గొనబోం అని  ప్రైవేట్‌ డిగ్రీ అండ్‌ పీజీ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది.
 

Advertisement
Advertisement