కరెంటు షాక్‌తో రైతు మృతి | current shock kills farmer in adilabad district | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో రైతు మృతి

Sep 27 2015 7:36 PM | Updated on Jul 29 2019 5:43 PM

కరెంట్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు.

దిలావర్‌పూర్(ఆదిలాబాద్): కరెంట్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లాలోని దిలావర్‌పూర్ మండల కేంద్రానికి చెందిన కొప్పుల చెతిర్ చిన్నభూమేశ్(38) అనే రైతు ఆదివారం ఉదయం తన పొలానికి వెళ్లాడు. విద్యుత్తు మోటార్లు నడవకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ను సరి చేద్దామనుకున్నాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ను నియంత్రించే ఆన్‌ఆఫ్ కడ్డీని పట్టుకుని లాగాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.


మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నర్సాపూర్(జి) పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య రాజమణి,12 సంవత్సరాలలోపు ఇద్దరు కుమార్తెలు, 6 సంవత్సరాల కుమారుడు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement