వానలు లేవు. ఎండలు మండుతున్నయి. పంటలు మాడిపోయినయి. కరువు తరుముకొస్తోంది. తీరని దుఃఖంతో కొందరు రైతులు ఎండిన పంటలకు నిప్పు పెట్టిండ్రు. ధైర్యం సడలని మరి కొందరు రైతులు నిజాంసాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో ‘నాగేటి సాల్లల్లో నా తెలంగాణ.. నా తెలంగాణ’ అంటూ పంటల సాగుకు సమాయత్తమవుతుండ్రు. మనసుంటే మార్గం లేదని నిరూపిస్తుండ్రు. ఆశల వేటను ఆనందంగా సాగిస్తుండ్రు. సింగూరుతో ప్రమాదముందని తెలిసినా వారు ముందుకే ‘సాగు’తుండ్రు. - నిజాంసాగర్ క్యాచ్మెంట్ ఏరియా
* శిఖం భూములలో నాగేటి సాళ్లు
* దుక్కులు దున్నుతున్న రైతన్నలు
* శనగ, మొక్కజొన్న విత్తుతున్నరు
* ఊరును విడిచి, పట్టాభూములు వదిలి
* ఆశల సాగుకు అన్నదాత అడుగులు
నిజాంసాగర్: ఉన్న ఊరు.. పట్టా భూములను వదిలి శిఖం భూములలో అన్నదాతలు పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. వానలు ఆశిం చిన మేరకు కురవకపోవడంతో.. నీళ్లులేక నల్ల రేగడి మట్టి తేలిన నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖం భూములలో ఆరుతడి పంటలను వే స్తున్నారు. వారం రోజుల నుంచి ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాల లో నాగటి సాల్లు జోరందుకున్నాయి. అరక చేతపట్టిన రైతన్నలు శిఖం భూముల్లో శనగ, జొన్న విత్తనాలు చల్లుతున్నారు.
మంజీరా నదిపై ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు ప్ర స్తుతం నీళ్లులేక బోసి పోయి ఉన్నా, పచ్చని పంటల సాగుకు నిలయం కానుంది. నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన రైతులు ఇక్కడ శనగ, జొన్న పంటలను సాగు చేస్తున్నారు. వేల ఎకరాలలో నీటి నిల్వ సామర్థ్యంతో విస్తరించిన ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా అపరాల సాగుకు దోహదపడుతోంది. ఖరీఫ్ సీజన్లో వానలు కురవక పోవడంతో ఖరీఫ్ పంటలను నష్టపోయిన రైతులు రబీ పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. ఉపాధి కోసం అన్వేషిస్తున్న రైతులు పట్టాభూములలో పంటలు వేయలేక శిఖం భూములను ఆశ్రయించారు.
మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, కల్హేర్, శంకరంపేట, పాపన్నపేట మండలాలకు చెందిన వందలాది మంది రైతులు శిఖం భూములలో పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్ మండలాలకు చెందిన రైతులు ప్రాజెక్టులో శనగ, జొన్న పంటల సాగుకు సమాయత్తమయ్యారు. ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు శిఖం భూములలో హద్దులను ఏర్పాటు చేసుకున్నారు. నాగళ్లు, ట్రాక్టర్ల ద్వారా భూములను దుక్కి చేసి శనగ, జొన్న విత్తనాలను విత్తుకుంటున్నారు. ప్రాజెక్టు పరిధిలోని సుమా రు 300 ఎకరాలలో పంటలను సాగు చేస్తున్నారు.
సింగూరు నీరొస్తే మునిగినట్టే...
నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో శిఖం భూములలో రైతులు పండిస్తున్న శనగ, జొన్న పంటలకు సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రమాదం కూడా పొంచి ఉంది.సాగర్ ఆయకట్టు కింద పండిస్తున్న పంటల కోసం, ఒక వేళ సింగూరు ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్కు నీటి విడుదల చేస్తే శిఖం భూములు మునిగిపోతాయి. రైతన్నలు ఆశతో సాగు చేస్తున్న పంటలు సైతం నీటి పాలవుతాయి. అయినా కుటుం బపోషణ కోసం ధైర్యం చేసి వేల రూపాయలు ఖర్చు చేస్తూ పంటలను సాగు చేస్తున్నారు. కరువును జయించేందుకు కర్షకులు పడరాని పాట్లు పడుతున్నారు.
పట్టాలి అరక.. దున్నాలి మెరక
Published Tue, Oct 14 2014 3:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement