సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

Cps System Cancel - Sakshi

జనగామ అర్బన్‌ : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, కామన్‌ సర్వీస్‌ రూల్స్‌ రూపొందించాలని టీటీజేఏసీ చైర్మన్‌ తిరునగరి శ్రీనివాస్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం టీటీజేఏసీ నూతన కార్యవర్గాన్ని వివిధ భాగస్వామ్య సం ఘాలు, పీఆర్‌టీయూ టీఎస్‌ ప్రధాన కార్యదర్శి కొల్ల మహిపాల్‌రెడ్డి సమన్వయంతో స్ధానిక పీఆర్‌టీయూ జిల్లా కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. పీఆర్‌సీ ఏర్పాటు కోరుతూ పదో తరగతి స్పాట్‌ వాల్యుయేషన్‌ను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అనంతరం టీటీజేఏసీ జిల్లా చైర్మన్‌గా పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు తిరునగరి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్‌గా టీపీయూఎస్‌ అధ్యక్షుడు ముసిని వేణుగోపాల్, డిప్యూటీ చైర్మన్‌గా టీఎస్‌హెచ్‌ఎంఏ అధ్యక్షుడు గాండె మల్లికార్జున్, కోచైర్మన్‌గా డీజీటీయూ ప్రధాన కార్యదర్శి జె.రత్నాకర్, కార్యదర్శిగా టీఎస్‌టీఎస్‌టీయూఎస్‌ అధ్యక్షుడు సలాడి సత్తయ్యను ఎన్నుకున్నారు. సమావేశంలో రమేష్, అర్జున్‌కుమార్, విద్యాసాగర్, సోమరాజు, విజ య్‌కుమార్, ప్రభాకర్, పంచాక్షరి, రత్నాకర్, మనోజ్‌కుమార్, శ్రీనివాస్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top