దేశ రాజకీయాల్లో తెలంగాణ కీలకం | Country Politics Main In Telangana MLA Rathod Bapurao | Sakshi
Sakshi News home page

దేశ రాజకీయాల్లో తెలంగాణ కీలకం

Apr 30 2018 8:01 AM | Updated on Aug 15 2018 9:06 PM

Country Politics Main In Telangana MLA Rathod Bapurao - Sakshi

పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బాపూరావు

నేరడిగొండ(బోథ్‌) : దేశ రాజకీయాల్లో తెలంగాణ కీలకం కానుందని బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మిషన్‌ కాకతీయ నాలుగో విడతలో భాగంగా మంజూరైన రూ.24.60 లక్షలతో మంగల్‌లొద్దిలో ట్యాంక్‌ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెడుతున్న పథకాలు దేశం దృష్టిని ఆకర్శిస్తున్నాయని అన్నారు.

బోథ్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెం.1 ఉండేలా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ రాథోడ్‌ కమల్‌సింగ్, బోథ్‌ ఏఎంసీ చైర్మన్‌ దావుల భోజన్న, ప్రముఖ కవి జీఆర్‌ కుర్మె, మండల నాయకులు రాథోడ్‌ సజన్, ఆడెపు రమేష్, మందుల రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement