పత్తిరైతు ఆత్మహత్య | Cotton farmer commits suicide | Sakshi
Sakshi News home page

పత్తిరైతు ఆత్మహత్య

Jan 10 2016 4:22 PM | Updated on Sep 3 2017 3:26 PM

అప్పుల బాధ తాళలేక పత్తి రైతు తనువు చాలించాడు.

అప్పుల బాధ తాళలేక పత్తి రైతు తనువు చాలించాడు. తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక పోవడంతో.. బలవంతంగా తనువు చాలించాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోని యానంబయలు పంచాయతి పరిధిలోని మందెరకలపాడు గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది.

గ్రామానికి చెందిన కాటి నారాయణ(38) నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement