సాక్షి, హైదరాబాద్/నందిగామ: కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా పలువురు ప్రముఖులు, సంస్థలు మంగళవారం సీఎంఆర్ఎఫ్కు విరాళాలు అందించారు.
► తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున రూ.10 కోట్లను సీఎంఆర్ఎఫ్ కు విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, సెక్రటరి ఎన్. శ్రీనివాసరావు, మెంబర్ ఒ.ఎన్. రెడ్డి సీఎం కేసీఆర్కు చెక్కును అందించారు. ఈ ఐదుగురు వ్యక్తిగతంగా మరో రూ.2.50 లక్షలు విరాళం అందించారు.
► గ్రీన్ కో గ్రూప్ రూ.5 కోట్ల విలువైన లక్ష పీపీఈ కిట్లు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ను గ్రీన్ కో గ్రూప్ ఎం.డి అనిల్ చలమలశెట్టి సీఎం కేసీఆర్కు అందించారు.
► మైత్రా ఎనర్జీ గ్రూప్ రూ.2.50 కోట్ల విలువైన పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ను ఎం.డి.విక్రమ్ కైలాస్, డైరెక్టర్ వివేక్ కైలాస్ సీఎం కేసీఆర్కు అందించారు.
► తెలంగాణ స్టేట్ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రూ.2 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ను ప్రెసిడెంట్ లక్ష్మీనరసింహారావు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు అందించారు.
► శ్రీ రామచంద్ర మిషన్ రూ.1.50 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును జాయింట్ సెక్రటరి వంశీ చలగుల్ల, డా.శరత్ కుమార్ ముఖ్యమంత్రికి అందించారు.
► ఆంధ్రప్రదేశ్ గ్యాస్ పవర్ కార్పొరేషన్ రూ.1 కోటి సీఎంఆర్ఎఫ్కు విరాళం అందించిం ది. దీనికి సంబంధించిన చెక్కును ఎం.డి.వెంకటేశ్వర రెడ్డి సీఎం కేసీఆర్కు అందించారు.
► కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సీఎంఆర్ఎఫ్కు రూ.7.41లక్షలు విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సీఎం కేసీఆర్కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.
► రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతి వనం నిర్వాహకులు సీఎం ఆర్ఎఫ్కు రూ.1.50 కోట్ల విరాళాన్ని అందజేశారు. కన్హా శాంతి వనం జాయింట్ సెక్రటరీ వంశీ, డా.శరత్ మంగళవారం హైదరాబాద్లోని సీఎం కేసీఆర్కు చెక్కు అందజేశారు.
► సీఎంఆర్ఎఫ్కు మంగళవారం 13 మంది దాతలు రూ.1.15 కోట్ల విరాళాలు అందజేశారు. విరాళాలకు సంబంధించిన చెక్కులను మంత్రి కేటీఆర్కు అందజేశారు. ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ రూ.30లక్షలు, పీపుల్ టెక్ ఐటీ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, చిరిపాల్ పాలీ ఫిల్మ్ రూ.25లక్షలు చొప్పున విరాళం ఇచ్చాయి.
సీఎంఆర్ఎఫ్కు భారీగా విరాళాలు
Published Wed, Apr 29 2020 2:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement