కబడ్డీ ఆడుతూ విద్యార్థి మృతి | college student dies while playing kabaddi | Sakshi
Sakshi News home page

కబడ్డీ ఆడుతూ విద్యార్థి మృతి

Mar 21 2017 7:46 PM | Updated on Mar 28 2018 11:26 AM

వర్ధమాన్ ఇంజనీరింగ్ కాళాశాల విద్యార్థి కబడ్డీ ఆడుతూ చనిపోయాడు.

రంగారెడ్డి (శంషాబాద్‌): శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం జరిగిన కబడ్డీ పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. కబడ్డీ ఆడుతూ  సివిల్‌ ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న సంపత్‌ అనే విద్యార్థి కళ్లు తిరిగి కిందపడిపోయాడు. దీంతో కళాశాల యాజమాన్యం చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కళాశాల యాజమాన్యం మండుటెండలో కబడ్డీ ఆడించినందు వల్లే మృతి చేందాడని ఆసుపత్రి వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement