సీఎం పర్యటన: స్కూళ్లకు సెలవు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీచేశారు. వ్యాపార సంస్థలు మూసివేయాలని పోలీసులు వర్తకులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీలకు చెందిన నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.