
సాక్షి, హైదరాబాద్: కంటి, పంటి వైద్య పరీక్షల కోసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాబోయే రోజుల్లో సీఎం ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉండనున్న నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.