టాయిలెట్లను శుభ్రం చేసిన ఎంపీ, ఎమ్మెల్యే | Cleaning toilets, MP, MLA | Sakshi
Sakshi News home page

టాయిలెట్లను శుభ్రం చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

Jul 8 2015 1:04 AM | Updated on Aug 28 2018 5:25 PM

టాయిలెట్లను శుభ్రం చేసిన ఎంపీ, ఎమ్మెల్యే - Sakshi

టాయిలెట్లను శుభ్రం చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలోని ఉన్నత పాఠశాలలో చేవెళ్ల ఎంపీ విశేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ...

మొయినాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలోని ఉన్నత పాఠశాలలో చేవెళ్ల ఎంపీ విశేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు టాయిలెట్లను శుభ్రం చేశారు.  మంగళవారం విజయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు పాఠశాలలోని టాయిలెట్లను, మరుగుదొడ్లను పరిశీలించారు. గ్రామంలోని పాఠశాల మధ్యనే మురుగునీటి కాల్వ ప్రవహిస్తుండడంతో దానిపై ఎలాంటి కప్పు లేనందున అధికారులు వెంటనే స్పందించాలన్నారు. బీసీ స్లాబ్ వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, సర్పంచ్‌ను ఆదేశించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement