కంది రైతులకు శుభవార్త  | Central Government Has Given Good News To Farmers | Sakshi
Sakshi News home page

కంది రైతులకు శుభవార్త 

Apr 22 2020 3:15 AM | Updated on Apr 22 2020 3:15 AM

Central Government Has Given Good News To Farmers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం కంది రైతులకు శుభవార్త అందించింది. ఈ ఖరీఫ్‌లో పండించిన లక్ష మెట్రిక్‌ టన్నుల కందులను అదనంగా ధరల స్థిరీకరణ నిధి కింద కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. కందుల ధరల స్థిరీకరణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ఆ లేఖలో అభినందించారు. అలాగే నిల్వల (బఫర్‌స్టాక్‌)ను ప్రజాపంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజనం, ఐసీడీఎస్‌లాంటి పథకాల కింద పౌష్టికాహారం అందజేసేందుకు రాష్ట్రంలో వినియోగించాలని పాశ్వాన్‌ సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement