కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే | BJP is Alternative to the Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే

Oct 20 2014 12:01 AM | Updated on Mar 29 2019 9:24 PM

కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే - Sakshi

కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే

మహారాష్ట్ర, హర్యానాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో పార్టీ కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం నింపిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చి రెడ్డి పేర్కొన్నారు.

మెదక్ మున్సిపాలిటీ: మహారాష్ట్ర, హర్యానాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో పార్టీ కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం నింపిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చి రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మెదక్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునకు ప్రజలు బాగా స్పందించారన్నారు. 

కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నయంగా ప్రజలు బీజేపీని చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు స్థానిక రాందాస్ చౌరస్తాలో టపాకాయలు కాలుస్తూ, స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ గడ్డం శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షుడు నల్లాల విజయ్, పట్టణ అధ్యక్షుడు గోదల క్రిష్ణ, ప్రధాన కార్యదర్శులు గుండు మల్లేశ్, కండెల సుధాకర్, మండల పార్టీ నాయకులు శ్రీపాల్, జనార్దన్, బక్కవారి శివ, తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డిలో సంబురాలు
సంగారెడ్డి క్రైం: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో సంగారెడ్డిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని, బాణ సంచా కాల్చారు. బీజేపీ జిల్లా ప్రధాన  కార్యదర్శి జగన్ మాట్లాడుతూ ఈ విజయం మోడీదేనన్నారు.  పేదలకు మోడీ ప్రభుత్వం చేయూతనిస్తోందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు.  కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి నాగరాజు, అసెంబ్లీ కన్వీనర్ నర్సారెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయలక్ష్మి, బీజెవైఎం నాయకుడు యశ్వంత్, పట్టణ అధ్యక్షుడు వాసు, సుధీర్‌రెడ్డి, శ్రీపతిరావు, బుచ్చిబాబు, చంద్రయ్య, వెంకట్‌రామ్‌రెడ్డి, నరేష్, నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement