రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | Bike overturns man died, one injured | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Apr 26 2016 7:45 PM | Updated on Apr 3 2019 7:53 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని మల్లారెడ్డిగూడ స్టేజీ వద్ద మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది.

షాబాద్(రంగారెడ్డి జిల్లా) : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని మల్లారెడ్డిగూడ స్టేజీ వద్ద మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన చెవిటిరాములు(40) అతని స్నేహితుడు  పోతుగంటి రమేశ్‌లు ద్విచక్ర వాహనంపై లక్ష్మరావుగూడ గ్రామానికి వస్తుండగా మల్లారెడ్డిగూడ స్టేజీ సమీపంలో బైకు అదుపుతప్పి కిందపడింది.

ఈ ప్రమాదంలో చెవిటి రాములు అక్కడిక్కడే మృతిచెందాడు. పోతుగంటి రమేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమ్మిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. మృతుడు చెవిటి రాములు భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement