ఉత్తమ ఉపాధ్యాయులు వీరే | best teachers for this year | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఉపాధ్యాయులు వీరే

Sep 3 2014 1:03 AM | Updated on Aug 15 2018 9:22 PM

తెలంగాణలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారి జాబితాను విద్యా శాఖ మంగళవారం రాత్రి ప్రకటించింది. జిల్లాల వారీగా వివరాలను వెల్లడించింది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారి జాబితాను విద్యా శాఖ మంగళవారం రాత్రి ప్రకటించింది. జిల్లాల వారీగా వివరాలను వెల్లడించింది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ విభాగంలో 21 మంది, నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ అవార్డ్స్-2014 కింద 17 మంది ఎంపికయ్యారు. ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆరుగురిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
 జాతీయ ఉత్తమ ప్రైమరీ టీచర్లు: డాక్టర్ ఎస్.వెంకటరామరాజు( స్కూల్ అసిస్టెంట్, యూపీఎస్ మక్తా, నల్గొండ), బి. వెంకట సుబ్బలక్ష్మి (ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, ఎంపీపీఎస్, పోలంపల్లి, కరీంనగర్), టి.గంగన్న(హెడ్ మాస్టర్, పీఎస్ యాపల్‌గూడ, ఆదిలాబాద్).

 

జాతీయ ఉత్తమ సెకండరీ టీచర్లు: బొడ్డు వెంకటేష్(గెజిటెడ్ హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ సిరిపురం, నల్గొండ), పారుపల్లి సురేష్(స్కూల్ అసిస్టెంట్, జీహెచ్‌ఎస్ మోమినన్, ఖమ్మం), నన్నపరాజు విజయశ్రీ(స్కూల్ అసిస్టెంట్ , జెడ్పీహెచ్‌ఎస్ నాదర్‌గుల్, రంగారెడ్డి).
 ఏపీలో 45 మంది: ఏపీలో 45 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆ ప్రభుత్వం ఎంపిక చేసింది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ (ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూ) అవార్డులకు మరో 29 మందిని ఎంపిక చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరందరికీ గుంటూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement