గవర్నర్కు కేటీఆర్ న్యూఇయర్ విషెస్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం కేటీఆర్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఉన్నారు.
సంబంధిత వార్తలు