సచివాలయ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు | Andhra Bank Free health camps in Secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు

Feb 24 2017 2:44 AM | Updated on Sep 5 2017 4:26 AM

ఖాతాదారులకు సేవలందిస్తూనే సామాజిక బాధ్యతగా ఉచిత ఆరోగ్య శిబిరాలు ఆంధ్రాబ్యాంక్‌ నిర్వహించడం అభినందనీయమని..

ఆంధ్రా బ్యాంకు సామాజిక సేవలు అభినందనీయం: రాజేశ్వర్‌ తివారీ
సాక్షి, హైదరాబాద్‌: ఖాతాదారులకు సేవలందిస్తూనే సామాజిక బాధ్యతగా ఉచిత ఆరోగ్య శిబిరాలు ఆంధ్రాబ్యాంక్‌ నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజేశ్వర్‌ తివారీ అన్నారు. గురువారం సచివాలయంలో ఆంధ్రాబ్యాంక్‌ సెక్రటేరియట్‌ శాఖ, యశోదా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, తెలంగాణ సెక్రటేరియట్‌ ఉద్యోగుల సంఘం నిర్వహించిన ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమం లో 10 మంది  వైద్య నిపుణుల బృందం సుమారు 800 మంది సచివాలయ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రా బ్యాంక్‌ జీఎం శ్రీధర్‌ మాట్లాడుతూ.. త్వరలో నిమ్స్‌కు అంబులెన్స్‌ను ఉచి తంగా అందజేయనున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement