ఏసీబీకి చిక్కిన వీఆర్వో | ACB caught VRO | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

May 29 2015 6:59 PM | Updated on Aug 17 2018 12:56 PM

పట్టాదారు పాస్‌ పుస్తకాల్లో పేరు మార్చడానికి రూ.3 వేలు లంచం డిమాండ్ చేసిన వీఆర్వో ఏసీబీకి చిక్కాడు.

నిజామాబాద్ : పట్టాదారు పాస్‌ పుస్తకాల్లో పేరు మార్చడానికి రూ.3 వేలు లంచం డిమాండ్ చేసిన వీఆర్వో ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.  వివరాల ప్రకారం.. ఘన్‌పూర్ గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్న ముత్తన్న.. అక్కాపూర్ గ్రామానికి చెందిన బేజి ఎల్లయ్య భూమికి చెందిన పట్టాదారు పాస్‌ పుస్తకాల్లో పేరు మార్చడానికి రూ.3వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఎల్లయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వీఆర్వోను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం అతన్ని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement