ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ | acb caught RI in nalgonda distirict | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ

Jun 25 2015 11:10 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఎన్‌ఓసీ సర్టిఫికెట్ జారీ చేయడానికి లంచం డిమాండ్ చేసిన ఆర్‌ఐ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

నల్లగొండ: ఎన్‌ఓసీ సర్టిఫికెట్ జారీ చేయడానికి లంచం డిమాండ్ చేసిన ఆర్‌ఐ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కరుణ వెంకట్‌రెడ్డి రోడ్డు పక్కన ఉన్న తన మూడున్నర గుంటల స్థలాన్ని తన కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడానికి ప్రయత్నించగా.. ఎన్‌ఓసీ సర్టిఫికెట్ అవసరం వచ్చింది. దీంతో ఆర్‌ఐ కృష్ఱని సంప్రదించగా.. రూ. 20 వేలు ఇస్తే వెంటనే ఇస్తాననడంతో.. తన దగ్గర అంత లేవని రూ. 5 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని ఏసీబీకి సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆర్‌ఐ లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.  ఆర్‌ఐ కృష్ణను అదుపులోకి తీసుకుని ఏసీబీ డీఎస్సీ కోటేశ్వర్రావు విచారణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement