విద్యుదాఘాతంతో రైతు మృతి | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 26 2017 2:55 AM

farmer was killed by electrocution - Sakshi

మహబూబాబాద్‌ రూరల్‌: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. మహబూబాబాద్‌ మండలం నడివాడ గ్రామపరిధిలోని రంగశాయిపేటకు చెందిన కొల్లు నర్సయ్య(60) తన వరి పొలం వద్ద గల బుర్ర కాలువకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా అక్కడున్న విద్యుత్‌ మోటార్‌కు కరెంట్‌ సరఫరా అవుతున్న విషయాన్ని గుర్తించలేదు. విద్యుత్‌ మోటార్‌కు ఉన్న పైపులకు నర్సయ్య కాళ్లు తగలగానే ఒక్కసారిగా అక్కడికక్కడే విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.  

Advertisement
Advertisement