గుప్త నిధుల తవ్వకాలు: 9 మంది అరెస్టు | 9 aressted in rangareddy distiirct | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల తవ్వకాలు: 9 మంది అరెస్టు

Sep 24 2015 11:58 AM | Updated on Mar 28 2018 11:11 AM

గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తుర్కయాంజల్: గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ ఏవీనగర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో కొందరు వ్యక్తులు ముప్పై అడుగుల లోతైన గుంతను తవ్వారు. అక్కడ పూజలు చేసిన ఆనవాళ్లు ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు తవ్వకాలు జరుపుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని, ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. అయితే, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకే గుంతను తవ్వుతున్నట్టు నిందితులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement