గాలిపటం ఎగిరేస్తూ.. | 8th class student dies of electric shock in hyderabad | Sakshi
Sakshi News home page

గాలిపటం ఎగిరేస్తూ..

Oct 17 2015 8:44 PM | Updated on Apr 3 2019 8:07 PM

గాలిపటం ఎగిరేస్తుండగా కరెంట్ షాక్ తగిలిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు.

దిల్‌సుఖ్‌నగర్: గాలిపటం ఎగిరేస్తుండగా కరెంట్ షాక్ తగిలిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూనాగోల్ లో శనివారం జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన సంతోష్(14) స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో పాఠశాలకు సెలవులు రావడంతో రెండు రోజుల కిందట ఇంటి పైన ఢాబా మీద గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలపై పడ్డాడు.

తీవ్రగాయాలైన అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement