ప్రైమరీ స్కూలుకు ముగ్గురు టీచర్లు | 3 teachers for every primary school | Sakshi
Sakshi News home page

ప్రైమరీ స్కూలుకు ముగ్గురు టీచర్లు

Apr 18 2015 2:18 AM | Updated on Jul 11 2019 5:01 PM

ప్రైమరీ స్కూలుకు ముగ్గురు టీచర్లు - Sakshi

ప్రైమరీ స్కూలుకు ముగ్గురు టీచర్లు

ప్రతి ప్రాథమిక పాఠశాలలో కచ్చితంగా ముగ్గురు టీచర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది.

  • ఏకోపాధ్యాయ పాఠశాలల విలీనం
  • సాక్షి, హైదరాబాద్: ప్రతి ప్రాథమిక పాఠశాలలో కచ్చితంగా ముగ్గురు టీచర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. తెలుగు/ఉర్దూ బోధనకు ఒక టీచర్, ఇంగ్లిష్ సబ్జెక్టుకు మరో టీచర్, గణితం ఇతర అంశాలను బోధించే ందుకు ఇంకో టీచర్ అవసరమని తేల్చింది. అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలలను కిలోమీటరు పరిధిలోని ఇతర స్కూళ్లలో విలీనం చేయనుంది. ఇందుకు ఎన్‌రోల్‌మెంట్ నిబంధనలు పాటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా రూపొందించిన విద్యా వార్షిక కేలండర్‌లో పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకొని అవసరమైన మార్పులతో ఈ నెల 20న ఖరారు చేయాలని నిర్ణయించింది. ఇకపై ప్రాథమిక, ఉన్నత పాఠశాలలే ఉంటాయని కేలండర్‌లో పేర్కొంది. ప్రస్తుతమున్న ప్రాథమికోన్నత పాఠశాలలను మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు.
     
     ఫిబ్రవరి నెలాఖరుకు పరీక్షలు పూర్తి: రాష్ట్రంలోని పాఠశాలల్లో పదో తరగతి మినహా ఇతర తరగతుల పరీక్షలను ఎప్పటిలా ఏప్రిల్ నెలలో కాకుండా ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తి చేయాలి. వచ్చే ఏడాది నుంచి వేసవి సెలవులకు ముందుగానే విద్యార్థులకు పైతరగతులకు సంబంధించిన పాఠ్యాంశాల బోధనను ప్రారంభించాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సర తరగతులను 2016 మార్చి 16 నుంచి ప్రారంభించి ఏప్రిల్ 23 వరకు నిర్వహించనుంది. వేసవి సెలవుల తర్వాత జూన్ 12 నుంచి తరగతులను కొనసాగించనుంది.
     
    విద్యా కేలండర్‌లోని మరిన్ని అంశాలు
    ఈ  నెల 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.  వచ్చే జూన్ నుంచి పాఠ్యాంశాల బోధనను చేపట్టి ఫిబ్రవరి నాటికే సిలబస్ పూర్తి చేస్తారు.  జూలై 30 నాటికి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి నివేదికలు రూపొందించాలి. వాటి ప్రకారం బోధనను కొనసాగించాలి. త్రైమాసిక (సమ్మేటివ్-1) పరీక్షలను సెప్టెంబరు 21 నుంచి 28 వరకు నిర్వహించాలి. ఆ తేదీల్లో వీలుకాకపోతే అక్టోబరు 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలి.  అర్ధ వార్షిక పరీక్షలను(సమ్మేటివ్-2) డిసెంబర్ 17 నుంచి 23 వరకు నిర్వహించాలి. వీలుకాకపోతే 2016 జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించాలి.  ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి 26 వరకు దసరా సెలవులు. డిసెంబర్ 24 నుంచి 30 వరకు క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు క్రిస్‌మస్ సెలవులు. 2016 జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement