కారు బోల్తా : 15 మందికి గాయాలు | 15 injure as Car over turns | Sakshi
Sakshi News home page

కారు బోల్తా : 15 మందికి గాయాలు

Jul 19 2015 9:30 AM | Updated on Sep 3 2017 5:48 AM

రోడ్డు ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

వరంగల్ (ఏటూరు నాగారం) : రోడ్డు ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం వరంగల్ జిల్లా మంగపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కమాలాపురం వద్ద బాధితులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. దీంతో 15 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

క్షతగాత్రులు పర్వతిగిరి, రాయపర్తి మండలాలకు చెందిన వారిగా సమాచారం. బాధితులు ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement