కొత్త ఐఫోన్లు భారత్‌లోకి వచ్చేది అప్పుడే! | iPhone 8, 8 Plus to retail in India from September 29 | Sakshi
Sakshi News home page

కొత్త ఐఫోన్లు భారత్‌లోకి వచ్చేది అప్పుడే!

Sep 13 2017 3:27 PM | Updated on Sep 19 2017 4:30 PM

కొత్త ఐఫోన్లు భారత్‌లోకి వచ్చేది అప్పుడే!

కొత్త ఐఫోన్లు భారత్‌లోకి వచ్చేది అప్పుడే!

ఎన్నో లీకేజీలు, మరెన్నో రూమర్ల అనంతరం ఆపిల్‌ తన సరికొత్త ఐఫోన్లను మంగళవారం రాత్రి కూపర్టినోలోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో ఆవిష్కరించింది.

ఎన్నో లీకేజీలు, మరెన్నో రూమర్ల అనంతరం ఆపిల్‌ తన సరికొత్త ఐఫోన్లను మంగళవారం రాత్రి కూపర్టినోలోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో ఆవిష్కరించింది. ఐఫోన్‌ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఐఫోన్‌X తో పాటు ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను తన అభిమానుల ముందుకు తీసుకొచ్చింది. ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్లగా ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు త్వరలోనే భారత్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. ఉత్తర, తూర్పు భారతంలోని అధికారిక స్టోర్లలో సెప్టెంబర్‌ 17 నుంచి వీటి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయని రిటైల్‌ దిగ్గజం బ్రైట్‌స్టార్‌ ఇండియా బుధవారం రిపోర్టు చేసింది. సెప్టెంబర్‌ 29 నుంచి ఈ కొత్త ఐఫోన్‌ మోడల్స్‌ అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది.
 
అదేవిధంగా ఫేసియల్‌ రిక్నైజేషన్‌తో వచ్చిన హైఎండ్‌ ఐఫోన్‌X, ప్రీఆర్డర్లు అక్టోబర్‌ 27 నుంచి ప్రారంభమవుతాయని బ్రైట్‌స్టార్‌ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కూడా నవంబర్‌3 నుంచి స్టోర్‌లలోకి వస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. హైఎండ్‌ ఫోన్‌గా ఆవిష్కరణ అయిన ఐఫోన్‌ X ప్రారంభ ధర భారత్‌లో రూ.89వేలుగా ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ల ప్రారంభ ధర రూ.64వేలని తెలిసింది. గ్లోబల్‌గా ఐఫోన్‌8, ఐఫోన్‌ 8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు సెప్టెంబర్‌ 22 నుంచి విక్రయానికి వస్తున్నాయి. 
 
ఐఫోన్‌ 8, 64జీబీ ధర రూ.64వేలు
ఐఫోన్‌ 8, 256 జీబీ వేరియంట్‌ ధర రూ.77వేలు
ఐఫోన్‌ 8 ప్లస్‌, 64జీబీ వేరియంట్‌ ధర రూ.73వేలు
ఐఫోన్‌ 8 ప్లస్‌, 256జీబీ వేరియంట్‌ ధర రూ.86వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement