మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య | Young Man Suicide For Wife In Orissa | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

Mar 25 2018 5:07 PM | Updated on Aug 29 2018 8:38 PM

Young Man Suicide For Wife In Orissa - Sakshi

ఆత్మహత్య చేసుకున్న వై. రామునాయుడు 

దత్తిరాజేరు : మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని టి. బూర్జివలసలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పెదమానాపురం ఎస్సై నాయుడు అందించిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వై. రామునాయుడి (32) భార్య చిన్నమ్మడు కొద్ది రోజుల కిందట కన్నవారింటికి పాతినవలస వెళ్లింది. నెలలు గడుస్తున్నా చిన్నమ్మడు ఇంటికి రాకపోవడంతో రామునాయుడు మనస్తాపం చెంద తన ఇంటి సమీపంలోని పశువుల శాలలో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఒక కుమార్తె ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement