ఉద్యోగం రాదేమోనని.. | young man commits suicide in karim nagar district | Sakshi
Sakshi News home page

ఉద్యోగం రాదేమోనని..

Nov 7 2016 2:55 PM | Updated on Aug 1 2018 2:31 PM

తనకు ఉద్యోగం రాదేమోనన్న బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య పాల్పడ్డాడు.

జమ్మికుంట: తనకు ఉద్యోగం రాదేమోనన్న బెంగతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఆబాలి జమ్మికుంట గ్రామానికి చెందిన మంత్రిరాజు(23)అనే యువకుడు ఆత్మహత్యకు చేసుకున్నాడు. హమాలీపని చేసుకునే సమ్మయ్య, రాజమ్మ దంపతులకు మంత్రి రాజు అనే కుమారుడున్నాడు. ఎంబీఏ పూర్తయిన మంత్రిరాజు గ్రూప్-2 పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే తనకు ఉద్యోగం రాదేమోనన్న బెంగతో సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు ఆదరువుగా ఉంటాడనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement