నిప్పంటించుకుని యువతి ఆత్మహత్యాయత్నం | women suicide attempt in nalgonda district | Sakshi
Sakshi News home page

నిప్పంటించుకుని యువతి ఆత్మహత్యాయత్నం

Sep 13 2016 3:09 PM | Updated on Oct 16 2018 8:46 PM

ఒంటిపై కిరోసిన్ పోసుకుని శ్రావణి(19) అనే యువతి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

యాదగిరిగుట్ట: ఒంటిపై కిరోసిన్ పోసుకుని శ్రావణి(19) అనే యువతి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన యువతిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement