భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం | women died due to sunstroke in bhadradri district | Sakshi
Sakshi News home page

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం

May 22 2017 2:14 PM | Updated on Sep 5 2017 11:44 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూతురు పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వెళ్లిన మహిళ వడదెబ్బకు గురై మృతిచెందింది. ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. కొత్తగూడెంలోని గాంధీనగర్‌ కాలనీలో నివాసముంటున్న షేక్‌ రజ్జబ్‌ హుస్సేన్‌- సైదానిబేగంల మూడో పుత్రిక జకియాబేగం వివాహం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలానికి చెందిన అహ్మద్‌ పాషాతో నిశ్ఛయమైంది.
 
ఈ రోజు పెళ్లి జరగనుండగా.. నిన్న(ఆదివారం) పెళ్లి కూతురు తల్లి సైదానిబేగం బంధుమిత్రులకు శుభలేఖలు ఇవ్వడానికి వెళ్లి వడదెబ్బకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా ఈ రోజు మృతి చెందింది. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. మరి కాసేపట్లో పెళ్లి జరగనుండగా పెళ్లి కూతురి తల్లి మరణించడంతో పెళ్లికొచ్చిన బంధువులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement