తూర్పుగోదావరి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన భార్యను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు.
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం
Apr 7 2017 2:54 PM | Updated on Sep 5 2017 8:11 AM
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన భార్యను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి భార్యను హతమార్చి అనంతరం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కాకినాడ మండలం పోలవరం గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. తల్లిదండ్రులిద్దరు మృతిచెందడంతో వారి ఏడాదిన్నార పాప అనథగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement