అత్తింటి వేధింపులు భరించలేక | woman commits suicide due to harassment | Sakshi
Sakshi News home page

అత్తింటి వేధింపులు భరించలేక

Jan 27 2017 1:02 PM | Updated on Oct 17 2018 6:06 PM

అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

నిజామాబాద్‌: అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా నాందెవాడలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న నాగరాజుకు నాలుగెళ్లి క్రితం లత(22)తో వివాహమైంది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ద్విచక్రవాహనం కొనుక్కోవడానికి డబ్బులు తీసుకు రమ్మని వేధిస్తుండటంతో.. గత ఆదివారం లత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది. కాగా.. మృతురాలి తల్లిదండ్రులు మాత్రం అత్తింటి వారే ఉరి వేశారని ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement