వివాహిత అనుమానాస్పద మృతి | wife died and husband injured in a accident | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Oct 29 2016 3:05 PM | Updated on Aug 30 2018 4:10 PM

ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

గూడూరు: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరు మండలం రావూరు సమీపంలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త రాంబాబు కథనం ప్రకారం... భార్య వెంకట నాగమణి(23)తో కలిసి ద్విచక్ర వాహనంపై కావలి వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని చెప్పాడు. తామిద్దరం కావలి నుంచి చెరువు మీదుగా బైక్‌పై రావూరు వస్తున్నామని, గుర్తు తెలియని వాహనం తమ బైక్‌ను ఢీకొట్టిందన్నాడు.

ఈ ఘటనలో తనకు గాయాలు కాగా భార్య నాగమణి తీవ్రగాయాలతో మృతిచెందిందని రాంబాబు చెబుతున్నాడు. ఆయన చికిత్స కోసం కావలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. కాగా, రాంబాబే నాగమణిని చంపాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement