ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య | Wife Betrays Husband With the help of lover | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

May 7 2018 12:17 PM | Updated on Jul 27 2018 2:21 PM

Wife Betrays Husband With the help of lover - Sakshi

తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య ప్రియుడితో భర్తను హత్య చేయించిన సంఘటన నామక్కల్‌లో సంచలనం కలిగించింది. నామక్కల్‌ జిల్లా పల్లిపాళయం ఆండికాడు ప్రాంతానికి చెందిన ఆనందన్‌ అద్దకం పట్ర నడుపుతున్నాడు. ఇతని భార్య జయలక్ష్మి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అద్దకం పట్రలో ఆనందన్‌ తీవ్రగాయాలతో శవంగా పడి ఉన్నాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పల్లిపాళయం పోలీసులు విచారణ చేపట్టారు. 

ఈ లోపు కార్తికేయన్‌ (సెంట్రింగ్‌ కార్మికుడు) పల్లిపాళయం వీఏఓ గోవిందరాజ్‌ వద్ద ఆనందన్‌ను హత్య చేశానని లొంగిపోయాడు. దీంతో గోవింద్‌రాజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కార్తికేయన్‌ను అరెస్టు చేశారు. పోలీసు విచారణలో కార్తికేయన్‌కు ఆనందన్‌ భార్య జయలక్ష్మికి వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలిసి ఆనందన్‌ భార్యను మందలించాడు. ఈ క్రమంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న ఆనందన్‌ను హత్య చేయడానికి జయలక్ష్మి కార్తికేయన్‌ పథకం వేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒంటరిగా నిద్రపోతున్న ఆనందన్‌ తలపై బండరాయి వేసి హత్య చేసినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement