ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వరుడిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
శ్రీవారి సేవలో దత్తాత్రేయ
Nov 26 2016 10:52 AM | Updated on Sep 4 2017 9:12 PM
తిరుమల: ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వరుడిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
Advertisement


