ఇంజినీరింగ్‌ విద్యార్థిని మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి

Published Tue, May 8 2018 12:04 PM

Suspicious death of engineering student - Sakshi

తిరువొత్తియూరు: కాంచీపురం జిల్లా పడాలం సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థిని ఆ కళాశాల హాస్టల్‌ మూడో అంతస్తు నుంచి కిందపడి మృతిచెందింది. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. పుదుకోట్టై జిల్లాకు చెందిన మురుగన్‌ కుమార్తె గాయత్రి (20). ఈమె కాంచీపురం జిల్లా పడాలం సమీపంలో ఉన్న చిన్న కొలపాక్కం ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (కర్పక వినాయకం) హాస్టల్‌లో ఉంటూ ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గాయత్రి ఆదివారం హాస్టల్‌ మూడో అంతçస్తు  నుంచి కింద పడి మృతిచెందింది. కళాశాల నిర్వాహకులు పడాలం పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమర్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement