నాసిక్: మూఢనమ్మకాల వ్యతిరేక బిలును చట్టరూపంలోకి తేవాల్సిన అవసరముందని దివంగత హేతువాది నరేంద్ర దభోల్కర్ కుమారుడు హమీద్ నొక్కి చెప్పారు. నాగపూర్లో జరిగే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం పొందేలా సర్కార్ చూడాలని ఆయన మంగళవారం మీడియాకు తెలిపారు. తన తండ్రి నరేం ద్ర చనిపోయిన తర్వాత మూఢనమ్మకాలు పాటించడం, చేతబడిపై నిషేధాన్ని విధిస్తూ రాష్ట్ర సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు దీన్ని చట్టం రూపంలోకి మార్చాల్సిన సమయమొచ్చిందని అన్నారు. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవా న్ హామీని ఇచ్చారని, ఒకవేళ ఈ బిల్లు ఓడితే అది సర్కార్ నైతిక ఓటమి అవుతుందని పేర్కొన్నారు.
డిసెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల ముందే దీనిపై ఏకాభిప్రాయం రావల్సిన అవసరముందని తెలిపారు. మూఢనమ్మకాలు, చేతబడిపై ఎన్నో ఏళ్లుగా ఉద్యమం చేసిన నరేంద్ర దభోల్కర్ను ఆగస్టు 20న పుణేలోని ఓంకారేశ్వర్ బ్రిడ్జిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజాగ్రహం పెల్లుబకడంతో ఆత్మరక్షణలో పడ్డ సర్కార్ మూఢ నమ్మకాల, చేతబడిపై నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్ను జారీ చేసింది. వివిధ ముసాయిదాల ద్వారా 2003లో అసెంబ్లీ ముందుకు వచ్చి న ఈ బిల్లు కోసం గత పదేళ్లుగా 29 సవరణలు చేశారు. మతాలను నమ్మించే పేరిట ప్రజలను మభ్యపెట్టేందు కోసం వినియోగిస్తున్న మూఢ నమ్మకాలను పాటించడం, చేతబడులను నిషేధిస్తూ ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని హమీద్ డిమాండ్ చేశారు.
శీతాకాల సమావేశాల్లోనే మూఢ నమ్మకాల వ్యతిరేక బిల్లు
Published Wed, Nov 27 2013 11:49 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
- Rahul Gandhi: మార్పు గాలి వీస్తోంది
Advertisement