మల్లన్న ఆదాయం రూ.24 లక్షలు | Siddipet mallanna temple hundis income 24 lakhs | Sakshi
Sakshi News home page

మల్లన్న ఆదాయం రూ.24 లక్షలు

Nov 25 2016 7:32 PM | Updated on Sep 4 2017 9:06 PM

(ఫైల్ ఫొటో)

(ఫైల్ ఫొటో)

ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి హుండీల ఆదాయం రూ.24 లక్షలు వచ్చింది.

సిద్ధిపేట : ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి హుండీల ఆదాయం రూ 24 లక్షల 37 వేలు 021 నగదు వచ్చింది. ఆలయ ఈవో రామకృష్ణారావు, ప్రత్యేక అధికారి ఏసీ కార్యాలయం అధికారి అనిల్ ఆధ్వర్యంలో 15 హుండీలను శుక్రవారం లెక్కించారు.

రూ 24 లక్షల నగదు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడున్నర కిలోల వెండితో పాటు 29 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని అధికారులు చెప్పారు. ఈ ఆదాయం 82 రోజుల్లో చేకూరిందని ఆలయ అభివద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈవో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement