కేజ్రీవాల్ ప్రకటనలను తొలగించనున్న ఢిల్లీ ప్రభుత్వం | SC allows photos of only President, Prime Minister or Chief Justice in govt ads | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ ప్రకటనలను తొలగించనున్న ఢిల్లీ ప్రభుత్వం

May 15 2015 12:58 AM | Updated on Apr 4 2018 7:42 PM

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫొటోలున్న ప్రభుత్వ ప్రకటనలను తొలగించనున్నట్లు గురువారం ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది.

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫొటోలున్న ప్రభుత్వ ప్రకటనలను తొలగించనున్నట్లు గురువారం ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం ప్రధాన న్యాయమూర్తుల ఫొటోలు మాత్రమే ప్రచురించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ చర్యను తీసుకుంటున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం తెలిపింది. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని, ఆ మేరకు సీఎం, ఇతర మంత్రుల ఫొటోలు ఉన్న ప్రకటనలను తొలగిస్తామని పేర్కొంది. కేజ్రీవాల్ బొమ్మలు లేకుండా ప్రభుత్వ విధానాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కష్టమని, అయినా ప్రత్యామ్నాయ పద్ధతిపై దృష్టి సారిస్తామని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement