చనిపోతూ 30 మందిని కాపాడాడు | Saved 30 people and dead | Sakshi
Sakshi News home page

చనిపోతూ 30 మందిని కాపాడాడు

Dec 21 2016 3:45 AM | Updated on Oct 19 2018 7:57 PM

ఆపద ముంచుకొస్తున్నపుడు పక్కవారి గురించి కూడా పట్టించుకోకుండా తమను తాము రక్షించుకునే వారెందరో..

- విధి నిర్వహణలో ఉన్న బస్సు డ్రైవర్‌కు గుండెపోటు
- ప్రయాణికులను రక్షించి, ప్రాణాలు విడిచిన డ్రైవర్‌


నల్లగొండ క్రైం: ఆపద ముంచుకొస్తున్నపుడు పక్కవారి గురించి కూడా పట్టించుకోకుండా తమను తాము రక్షించుకునే వారెందరో.. అలాంటి వారికి విరుద్ధంగా ఓ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ సమయ ‘స్ఫూర్తి’తో వ్యవహరించి ఆదర్శప్రాయుడిగా నిలిచారు. విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు వచ్చినా లెక్క చేయకుండా బస్సును రోడ్డు పక్కన నిలిపి 30 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి తాను మాత్రం ప్రాణాలొదిలాడు. ఈ విషాదకర ఘటన నల్లగొండలో చోటు చేసుకుంది. నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బొడ్డు జానయ్య(36) స్థానిక ఆర్టీసీ డిపోలో అద్దెబస్సు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

మంగళవారం ఉదయం 5:30 గంటలకు నల్లగొండ డిపో నుంచి 30 మంది ప్రయాణికులతో బస్సు దేవరకొండకు బయలు దేరింది. మార్గమధ్యలో నల్లగొండ శివారు వైఎస్సార్‌ విగ్రహం వద్దకు వెళ్లగానే జానయ్యకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. అమ్మా అంటూ ఓ చేత్తో ఛాతీని అదిమి పట్టుకుంటూనే సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన నిలిపాడు. కండక్టర్‌తో గుండెలో నొప్పి వస్తుందంటూనే కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని వెంటనే 108 అంబులెన్స్‌లో నల్లగొండ ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement