వరంగల్ రైల్వే స్టేషన్లో భారీగా బంగారం పట్టుబడింది.
రైల్వే స్టేషన్లో భారీగా బంగారం
Mar 2 2017 12:14 PM | Updated on Aug 21 2018 6:22 PM
వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్లో భారీగా బంగారం పట్టుబడింది. గురువారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఓ వ్యక్తి వద్ద నుంచి 60 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాల విలువ సుమారు రూ. 18 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తుండటంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement