నవ వధువు ఆత్మహత్య | Newly married woman commits suicide | Sakshi
Sakshi News home page

నవ వధువు ఆత్మహత్య

Sep 18 2016 1:16 AM | Updated on Sep 4 2017 1:53 PM

నవ వధువు ఆత్మహత్య

నవ వధువు ఆత్మహత్య

పెళ్లయిన ఆరు నెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.

 బెంగళూరు (బనశంకరి) : పెళ్లయిన ఆరు నెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. నగరానికి చెందిన తేజస్విని (25) ఇక్కడి ఫిలిప్స్ కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తోంది. చెన్నైకి చెందిన దేవరాజ్ మెట్రిమోని ద్వారా తేజస్వినిని ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. నగరంలోని తిండ్లుక్రాస్‌లోని ఓ అపార్టుమెంట్‌లో దంపతులు నివాసముంటున్నారు.
 
 ఇదిలా ఉంటే వ్యాపారం కోసం కొంత పెట్టుబడి కావాలని తరచూ భార్య తేజస్విని దేవరాజ్ వేధించేవాడని సమాచారం. తేజస్విని తల్లిదండ్రులు కూడా సమీపంలోనే నివాసముంటున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం మధ్యాహ్నం తేజస్విని చివరిగా తల్లితో ఫోన్‌లో మాట్లాడింది. కొద్దిసేపు అనంతరం తేజస్విని ఉరి వేసుకుందని ఫోన్ రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన కుమార్తె ఇంటికి వెళ్లారు.
 
  అక్కడ తేజస్విని ఉరి వేసుకున్నృదశ్యం అనుమానంగా ఉండటంతో వారు కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న మోదు చేసుకున్న పోలీసులు దేవరాజ్‌ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ చేస్తున్నారు. డబ్బు ఇవ్వకపోవడంతో భర్త దేవరాజ్, తేజస్వనిని హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement