వాయవ్య ముంబై నుంచి పోటీ చేస్తా: మయాంక్ గాంధీ | Mayank Gandhi to contest Lok Sabha polls from Mumbai | Sakshi
Sakshi News home page

వాయవ్య ముంబై నుంచి పోటీ చేస్తా: మయాంక్ గాంధీ

Jan 7 2014 10:51 PM | Updated on Aug 29 2018 8:56 PM

వాయవ్య ముంబై నుంచి పోటీ చేస్తా: మయాంక్ గాంధీ - Sakshi

వాయవ్య ముంబై నుంచి పోటీ చేస్తా: మయాంక్ గాంధీ

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో వాయవ్య ముంబై నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మయాంక్ గాంధీ తెలిపారు.

ముంబై: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో వాయవ్య ముంబై నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మయాంక్ గాంధీ తెలిపారు. ‘ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నా’అని  మంగళవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీలోగా తమ పార్టీ అధిష్టానం మహారాష్ర్ట నుంచి లోక్‌సభ బరిలోకి దిగనున్న అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తుందన్నారు. అనంతరం మయాంక్ సహచరుడు అంజలి దమానియా మాట్లాడుతూ బీజేపీ అగ్రనాయకుడు నితిన్ గడ్కరీకి వ్యతిరేకంగా నాగపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement