4 నిమిషాల్లో మూడుముళ్లు | Lockdown Mysore Wedding Complete in Four Minutes | Sakshi
Sakshi News home page

4 నిమిషాల్లో మూడుముళ్లు

Apr 6 2020 7:01 AM | Updated on Apr 6 2020 7:01 AM

Lockdown Mysore Wedding Complete in Four Minutes - Sakshi

మైసూరు: పెళ్ళి అనగానే ఎంత ఎక్కువమంది అతిథులు తరలివస్తే అంత ఆడంబరంగా జరిగినట్లు లెక్క. కానీ ప్రస్తుతం కరొనా వైరస్‌ ప్రభావంతో పెళ్లి వేడుకలు వాయిదా పడుతున్నాయి. కొందరేమో వైరస్‌కు సవాల్‌ విసురుతూ మూడుముళ్లకు సై అంటున్నారు. అలా నలుగురి మధ్య నాలుగు నిమిషాల్లో పెళ్ళి పూర్తయిన వైనం  ఆదివారం మైసూరులో చోటు చేసుకుంది.

నగరంలోని గోకులంలో ఉన్న గణపతి దేవాలయంలో సివిల్‌ ఇంజనీర్‌ అయిన సోనియా, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్‌ అయిన పరశురామ్‌కు కరోనా గొడవకు ముందే పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 17వ తేదీన ముహూర్తం. కరోనా సమస్య వల్ల ఇక ఆలస్యం కాకూడదని ఆదివారమే ఆలయంలో ఇరువురి తల్లిదండ్రుల మధ్య మాంగల్యం తంతునానేనా అనిపించారు. పెళ్లి కళ లేకపోవడంతో కొత్త జంటలో నిరుత్సాహం తాండవించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement