రక్షిత పెళ్లికూతురాయనే ! | Karnataka Minister Sriramulu Daughter Rakshita Marriage Cermony In Bellary | Sakshi
Sakshi News home page

రక్షిత పెళ్లికూతురాయనే !

Mar 3 2020 9:01 AM | Updated on Mar 3 2020 10:18 AM

Karnataka Minister Sriramulu Daughter Marriage In Bellary - Sakshi

సాక్షి, బళ్లారి : కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీరాములు ఇంట పెళ్లి సందడి మొదలైంది. శ్రీరాములు పెద్ద కుమార్తె రక్షిత వివాహం ఈ నెల 5న బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో హైదరాబాద్‌కు చెందిన లలిత్‌ సంజీవ్‌రెడ్డితో జరగనుంది. సోమవారం బళ్లారి హవంబావిలో శ్రీరాములు స్వగృహంలో పెళ్లి వేడుకలను  సంప్రదాయబద్ధంగా ప్రారంభించి రక్షితను పెళ్లి కుమార్తెను చేశారు. శ్రీరాములు దంపతులు కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ నుంచి బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరు ప్యాలెస్‌లోని 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా కళా దర్శకులు వివాహ మంటపాన్ని తీర్చిదిద్దారు. 
(రక్షిత వివాహానికి ప్రధానికి ఆహ్వానం)

Advertisement
 
Advertisement
Advertisement