అనుమానాస్పదస్థితిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు.
ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి
Nov 1 2016 11:58 AM | Updated on Nov 6 2018 8:28 PM
విశాఖపట్నం: అనుమానాస్పదస్థితిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. విశాఖకు చెందిన ప్రదీప్ అనే విద్యార్థి మృతదేహం శారదానది వద్ద లభ్యమైంది. ప్రియురాలి బంధువులే అతడిని కొట్టి చంపారంటూ ప్రదీప్ బంధువులు ఆరోపిస్తున్నారు. కశింకోట పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహంతో అతడి బంధువులు రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ జాం ఏర్పడింది. ప్రదీప్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
Advertisement


